Webdunia - Bharat's app for daily news and videos

Install App

సియట్ అత్యుత్తమ క్రికెటర్‌గా రహానే: రోహిత్‌కు ప్రత్యేక అవార్డ్

Webdunia
మంగళవారం, 26 మే 2015 (12:33 IST)
టీమిండియా బ్యాట్స్‌మెన్ రహానే 2015 సంవత్సరానికి గాను సియట్ అత్యుత్తమ భారత క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. ఇక శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలిచాడు. 1983లో భారత్‌కు తొలి ప్రపంచ కప్‌ను అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల దేవ్‌కు జీవిత కాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యాడు. 
 
'సియట్' తన 19వ వార్షికోత్సవ అవార్డుల కార్యక్రమం ముంబైలో సోమవారం జరిగింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టుపై 41 పరుగులు తేడాతో విజయం సాధించి ఐపీఎల్‌లో రెండోసారి ఛాంపియన్‌గా అవతరించడంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ శర్మకు, గత ఏడాది కోల్‌కత్తాలో శ్రీలంకపై వన్డేల్లో 264 పరుగులు సాధించినందుకు గాను ప్రత్యేక అవార్డుని ప్రకటించారు. 
 
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మ సాధించిన రెండో డబుల్ సెంచరీ ఇదే కావడం గమనార్హం. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మనే కావడం విశేషం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments