Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న రోహిత్ శర్మ.. నేడు విరాట్ కోహ్లీ.. భారత్‌కు గాయాల బెడద

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (14:59 IST)
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు గాయాలబెడద ఎక్కువైంది. ఇటీవల ప్రాక్టీస్ చేస్తుండగా, కెప్టెన్ రోహిత్ శర్మ మోచేతికి గాయమైంది. బుధవారం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడ్డారు. 
 
నెట్ ప్రాక్టీస్‌ చేస్తున్నపుడు పేసర్ హర్షల్ పటేల్ వేసిన ఓ బంతి గజ్జల్లో తగలడంతో కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. పైగా, నొప్పి ఎక్కువ కావడంతో ప్రాక్టీస్ మానేసి వెళ్లిపోయాడు. దీంతో కోహ్లీకి బలమైన గాయమే తగిలివుంటుందన్న ఆందోళన మొదలైంది. 
 
కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ మంగళారం ఇలానే స్వల్ప గాయానికే గురయ్యాడు. త్రౌ డౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన బంతి రోహిత్ కుడి ముంజేయికి గట్టిగా తగిలింది. దీంతో రోహిత్ శర్మ నొప్పితో విలవిలలాడు. అయితే, 40 నిమిషాల తర్వాత రోహిత్ మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో బుధవారం విరాట్ కోహ్లీకి బంతి గజ్జల్లో తగిలిన తర్వాత ఆయన నెట్ నుంచి వెళ్లిపోవడం ఇపుడు ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటివరకు కోహ్లీ ఆడిన ఐదు మ్యాచ్‌లలో 123 సగటుతో 246 పరుగులు చేసిన విషయం తెల్సిందే. ఇపుడు గురువారం ఇంగ్లండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడో లేదో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments