WHO: భారత్‌లో 13% తగ్గిన కొత్త కేసులు

Webdunia
బుధవారం, 19 మే 2021 (22:07 IST)
జెనీవా: గడచిన వారం రోజుల్లో భారత్‌లో కరోనా కేసులు 13 శాతం తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తాజా కేసుల నమోదులో మాత్రం భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.

మే 16 వరకు నమోదైన కేసులను.. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం తాజా కేసుల్లో 13 శాతం, మరణాల్లో 5 శాతం తగ్గుదల ఉన్నట్లు వీక్లీ రిపోర్టులో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ తాజా కేసులు నమోదవుతున్న దేశాల్లో మొదటి స్థానంలో భారత్‌ ఉండగా.. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్‌, అమెరికా, అర్జంటీనా, కొలంబియా ఉన్నట్లు తెలిపారు.

తాజా మరణాల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో నేపాల్‌, ఇండోనేసియా ఉన్నాయి. దాదాపుగా ప్రపంచంలోని అన్ని రీజియన్లలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆ నివేదికలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments