కేంద్ర మంత్రి ధర్మేంద ప్రధాన్‌కు కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (10:19 IST)
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో కరోనా వైరస్ సోకిన మంత్రుల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే కేంద్రం హోం మంత్రి అమిత్ షాకు ఈ వైరస్ సోకగా, ఆయన గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 
 
ఇపుడు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే డాక్టర్ల సూచనతో గురుగ్రామ్‌లోని మేదాంత ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
 
కాగా, తనకు కరోనా సోకడం పట్ల ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, రిపోర్టులో పాజిటివ్ అని వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.
 
మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కాంటాక్ట్ అయిన కేంద్ర మంత్రులు రవిశంకర ప్రసాద్, బాబుల్‌లు ఇప్పటికే సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. అలాగే, మరికొందరు ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Eesha Rebha: ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Peddi: రామ్ చరణ్ చిత్రం పెద్ది విడుదల వాయిదా వేశారు

Rajasekhar: బుల్లెట్ సునీల్ గా రాజశేఖర్ పవర్ ఫుల్ రీ-స్టార్ట్ గ్లింప్స్ రిలీజ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటన

J. D. Chakravarthy: ప్రచారం కోసం బూతులు మాట్లాడడాన్ని బరాబర్ ఖండిస్తున్నా : జె. డి. చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

తర్వాతి కథనం
Show comments