Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొనసాగుతున్న కరోనా విజృంభణ : మరో 42 వేల పాజిటివ్ కేసులు

India
Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (10:12 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనేవుంది. రోజువారీ కేసులను పరిశీలిస్తే సోమవారం 24 గంటల్లో 30 వేలకు దిగిరాగా.. తాజాగా  అంటే గత 24 గంటల్లో 42 వేలకు పైగా నమోదయ్యాయి. మొత్తం 42,625 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
కొత్తగా 26,668 మంది బాధితులు కోలుకోగా.. మరో వైపు 562 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,17,69,132 కు పెరిగింది. ఇప్పటివరకు 3,09,33,022 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 4,25,757 మంది మృత్యువాతపడ్డారు. 
 
ప్రస్తుతం దేశంలో 4,10,353 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.37శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.29శాతం ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.31శాతంగా ఉందని తెలిపింది. 
 
దేశంలో ఇప్పటివరకు 47.31 కోట్ల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించామని, టీకా డ్రైవ్‌లో భాగంగా మొత్తం 48,52,86,570 టీకా మోతాదులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments