Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో లక్షన్నరకు చేరువైన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (12:46 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 21880 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 60 మంది చనిపోయారు. 
 
దేశంలో 4,95,359 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, వీరిలో 21,880 మందికి కరోనా వైరస్ సోకినట్టు తెలిపింది. అలాగే, కరోనా నుంచి 21,219 మంది విముక్తులయ్యారు. వీరితో కలుపుకుని కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,31,71,653కు చేరింది. మరోవైపు, తాగా మృతి చెందిన 60 మందితో కలుపుకుంటే మొత్తం చనిపోయిన వారి సంఖ్య 5,25,930కి చేరింది. 
 
ఇటీవలికాలంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య కంటే ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,49,482 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే, దేశంలో క్రియాశీల రేటు 0.34 శాతంగాను, రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments