దేశ వ్యాప్తంగా 17,070 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (10:39 IST)
దేశ వ్యాప్తంగా 17070 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,34,69,234కు చేరుకున్నాయి. ఇందులో 4,28,36,906 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల్లో 5,25,139 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,07,189 మంది వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు మొత్తం 23 మంది చనిపోగా, 14,413 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
అయితే, రోజువారీ పాజిటివిటీ రేటు 3.20 శాతంగా ఉందని కేంద్రం పేర్కొంది. మొత్తం కేసుల్లో 0.24 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు తెలిపింది. రికవరీ రేటు 98.55 శాతంగాను, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

తర్వాతి కథనం
Show comments