Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బాలల విద్య కోసం నెలకు రూ.2వేలు చెల్లించాలి.. సుప్రీం ఆదేశం

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (16:21 IST)
కోవిడ్-19 మహమ్మారి కారణంగా తమ కుటుంబాల వద్దకు వెళ్ళిన బాలల విద్య కోసం నెలకు రూ.2,000 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సీసీఐలలో ఆశ్రయం పొందిన బాలలకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు పుస్తకాలు, స్టేషనరీ సహా అవసరమైన మౌలిక సదుపాయాలను సీసీఐలకు సమకూర్చాలని తెలిపింది. చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్ (సీసీఐ)లో ఆశ్రయం పొందిన బాలల విద్య కోసం ఈ మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా సుప్రీం పేర్కొంది. 
 
డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ల సిఫారసుల ఆధారంగా ఈ సదుపాయాలను 30 రోజుల్లోగా సమకూర్చాలని తెలిపింది. సీసీఐలలోని బాలలకు విద్యను బోధించేందుకు అవసరమైన టీచర్లను నియమించాలని తెలిపింది.
 
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో చైల్డ్ కేర్ సెంటర్లలోని బాలల పరిస్థితులపై సుప్రీంకోర్టు స్వీయ విచారణ జరిపింది. అడ్వకేట్ గౌరవ్ అగర్వాల్ అమికస్ క్యూరీగా వ్యవహరించారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగీ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. సీసీఐలలో 2.27 లక్షల మంది ఉన్నారని, వీరిలో 1.45 లక్షల మంది తమ కుటుంబాలు, సంరక్షకుల వద్దకు చేరుకున్నారని ధర్మాసనానికి అమికస్ క్యూరీ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments