Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ పేషెంట్లకు అధునాతన చికిత్స కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 పడకల ఆసుపత్రి

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (23:53 IST)
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తున్న భయానక పరిస్థితులను చూస్తూనే వున్నాం. లక్షల్లో ఆ వ్యాధి బారిన పడినవారు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్నారు. మన దేశంలోనూ ఈ వైరస్ క్రమంగా దాని ప్రభావాన్ని చూపుతోంది. ఐతే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. 
 
మరోవైపు కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తన వంతు బాధ్యతగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కరోనా పేషెంట్లకు అధునాతన చికిత్స కోసం వంద పడకల ప్రత్యేక వసతిని ఏర్పాటు చేసింది. ఇంకా రోజుకు 1,00,000 మాస్కులను ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ముంబై మహానగర పాలిక, సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఇందులో వ్యాధి కారక క్రిముల వ్యాప్తిని నిరోధించే గది కూడా వుంది. కేవలం 15 రోజుల్లోనే ఈ 100 పడకల వసతిని ఏర్పాటు చేసినట్టు సంస్థ తెలిపింది. రోగులకు అవసరమైన అన్ని సేవలు అందుబాటులో వుంచినట్లు తెలియజేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments