Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ పేషెంట్లకు అధునాతన చికిత్స కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 పడకల ఆసుపత్రి

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (23:53 IST)
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తున్న భయానక పరిస్థితులను చూస్తూనే వున్నాం. లక్షల్లో ఆ వ్యాధి బారిన పడినవారు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్నారు. మన దేశంలోనూ ఈ వైరస్ క్రమంగా దాని ప్రభావాన్ని చూపుతోంది. ఐతే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. 
 
మరోవైపు కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తన వంతు బాధ్యతగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కరోనా పేషెంట్లకు అధునాతన చికిత్స కోసం వంద పడకల ప్రత్యేక వసతిని ఏర్పాటు చేసింది. ఇంకా రోజుకు 1,00,000 మాస్కులను ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ముంబై మహానగర పాలిక, సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఇందులో వ్యాధి కారక క్రిముల వ్యాప్తిని నిరోధించే గది కూడా వుంది. కేవలం 15 రోజుల్లోనే ఈ 100 పడకల వసతిని ఏర్పాటు చేసినట్టు సంస్థ తెలిపింది. రోగులకు అవసరమైన అన్ని సేవలు అందుబాటులో వుంచినట్లు తెలియజేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments