Webdunia - Bharat's app for daily news and videos

Install App

తైవాన్ మాత్రం ఆ విషయంలో గ్రేట్..

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (17:14 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తైవాన్ మాత్రం ఈ విషయంలో మిగతా దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉంది. గత 200 రోజులుగా అక్కడ స్థానికంగా ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. ఫలితంగా ఇన్ని రోజులపాటు కేసు నమోదు కాని ఏకైక దేశంగా రికార్డులకెక్కింది.

తైవాన్‌లో చివరిసారి ఏప్రిల్ 12న కేసు నమోదైంది. 23 మిలియన్ల మంది కలిగిన తైవాన్‌లో ఇప్పటి వరకు 553 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఏడుగురు మృత్యువాత పడ్డారు.
 
కరోనాపై పోరులో అందరికంటే ముందే సరిహద్దులు మూసివేయడం, ప్రయాణ ఆంక్షలు విధించడం కారణంగా అక్కడ కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, ప్రజలందరూ మాస్కులు ధరించడం, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటివి కూడా వైరస్‌కు అడ్డుకట్ట వేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను అడ్డుకున్న ఏకైక దేశం తైవానేనని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments