Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా అనుమానితుడు ఆసుపత్రి నుంచి పరార్, పట్టుకోండి, పట్టుకోండి

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (15:37 IST)
కరోనా వైరస్ సోకితే ఇక ఆ రోగికి కుటుంబ సభ్యులతో పాటు బయట స్నేహితులతో కూడా సంబంధం లేకుండా అయిపోతుంది. ఎందుకంటే ఆ వైరస్ అంత ప్రమాదకారి. రోగి నుంచి చాలా సులభంగా ఇతర వ్యక్తికి సోకుతుంది. ప్రాణాలు తీస్తుంది. అందువల్ల కరోనా వైరస్ సోకిన రోగి అంటే వైద్యులు వెంటనే అప్రమత్తం అవడమే కాకుండా అతడిని ప్రత్యేకంగా ఐసోలేటెడ్ గదిలో వుంచి చికిత్స అందిస్తున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... పంజాబ్ రాష్ట్రంలోని మోఘాలో ఓ వ్యక్తి తీవ్రమైన జలుబు, దగ్గుతో విపరీతంగా బాధపడుతున్నాడు. దీనితో అతడు తనకు కరోనా వ్యాధి వచ్చిందేమోనని అనుమానంతో ఆసుపత్రికి వెళ్లాడు. అతడిని చూసిన వైద్యులు ప్రత్యేక గదిలో వుంచి రక్త నమూనాలు సేకరించారు. ఇంతలో ఈ విషయం కాస్తా మీడియాకు లీకవ్వడంతో అంతా కెమేరాలు, వాహనాలు తీసుకుని అక్కడికి వెళ్లారు. 
 
ప్రత్యేక గదిలో వున్న వ్యక్తిని ఫోటోలు, వీడియోలు తీసి వాటిని ప్రసారం చేయడమే కాకుండా సదరు వ్యక్తికి కరోనా అనుమానం అంటూ వార్తలు స్క్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనితో అతడి కుటుంబ సభ్యులు ఇవి చూసి ఆందోళన చెందారు. ఇది తెలుసుకున్న సదరు వ్యక్తి ఆసుపత్రి నుంచి చెప్పాపెట్టకుండా పారిపోయాడు. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది షాక్ తిన్నది. వెంటనే పోలీసులను వెంటబెట్టుకుని ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి నచ్చ చెప్పి తిరిగి ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం అతడి బ్లడ్ శాంపిళ్లు పంపి అతడికి కరోనా వుందా లేదా అని చెక్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments