కరోనా ముక్త్ పింద్ అభియాన్ : ప్రతి గ్రామానికి రూ.10 లక్షల గ్రాంటు

Webdunia
బుధవారం, 19 మే 2021 (10:41 IST)
కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. ఈ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్లు వేసుకునేందుకు ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ప్రోత్సిహిస్తుంది. ముఖ్యంగా, కరోనా ముప్పు నుంచి ప్రజల ప్రాణాల్ని కాపాడేవి అప్రమత్తత, వ్యాక్సినేనని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. 
 
కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు పంజాబ్‌ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్న ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా వేసేందుకు సమాయత్తమవుతోంది. 
 
ఇందులోభాగంగా ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ‘కరోనా ముక్త్‌ పింద్‌ అభియాన్‌’ పేరిట ప్రత్యేక అభివృద్ధి గ్రాంటును ప్రకటించారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేలా 100 శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్నిసాధించిన ప్రతి గ్రామాలకు ప్రోత్సాహకంగా రూ.10 లక్షల చొప్పున గ్రాంటు ఇవ్వనున్నట్టు తెలిపారు. 
 
మరోవైపు, టీకా కొరత వేధిస్తున్న నేపథ్యంలో పంజాబ్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగానే కొనసాగుతోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ మరికొన్ని రోజుల్లో వస్తే ఈ కార్యక్రమం వేగం పుంజుకొనే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments