Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ముక్త్ పింద్ అభియాన్ : ప్రతి గ్రామానికి రూ.10 లక్షల గ్రాంటు

Webdunia
బుధవారం, 19 మే 2021 (10:41 IST)
కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. ఈ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్లు వేసుకునేందుకు ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ప్రోత్సిహిస్తుంది. ముఖ్యంగా, కరోనా ముప్పు నుంచి ప్రజల ప్రాణాల్ని కాపాడేవి అప్రమత్తత, వ్యాక్సినేనని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. 
 
కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు పంజాబ్‌ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్న ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా వేసేందుకు సమాయత్తమవుతోంది. 
 
ఇందులోభాగంగా ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ‘కరోనా ముక్త్‌ పింద్‌ అభియాన్‌’ పేరిట ప్రత్యేక అభివృద్ధి గ్రాంటును ప్రకటించారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేలా 100 శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్నిసాధించిన ప్రతి గ్రామాలకు ప్రోత్సాహకంగా రూ.10 లక్షల చొప్పున గ్రాంటు ఇవ్వనున్నట్టు తెలిపారు. 
 
మరోవైపు, టీకా కొరత వేధిస్తున్న నేపథ్యంలో పంజాబ్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగానే కొనసాగుతోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ మరికొన్ని రోజుల్లో వస్తే ఈ కార్యక్రమం వేగం పుంజుకొనే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments