Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ముక్త్ పింద్ అభియాన్ : ప్రతి గ్రామానికి రూ.10 లక్షల గ్రాంటు

Webdunia
బుధవారం, 19 మే 2021 (10:41 IST)
కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. ఈ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్లు వేసుకునేందుకు ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ప్రోత్సిహిస్తుంది. ముఖ్యంగా, కరోనా ముప్పు నుంచి ప్రజల ప్రాణాల్ని కాపాడేవి అప్రమత్తత, వ్యాక్సినేనని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. 
 
కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు పంజాబ్‌ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్న ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా వేసేందుకు సమాయత్తమవుతోంది. 
 
ఇందులోభాగంగా ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ‘కరోనా ముక్త్‌ పింద్‌ అభియాన్‌’ పేరిట ప్రత్యేక అభివృద్ధి గ్రాంటును ప్రకటించారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేలా 100 శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్నిసాధించిన ప్రతి గ్రామాలకు ప్రోత్సాహకంగా రూ.10 లక్షల చొప్పున గ్రాంటు ఇవ్వనున్నట్టు తెలిపారు. 
 
మరోవైపు, టీకా కొరత వేధిస్తున్న నేపథ్యంలో పంజాబ్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగానే కొనసాగుతోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ మరికొన్ని రోజుల్లో వస్తే ఈ కార్యక్రమం వేగం పుంజుకొనే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments