Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విజృంభణ.. విద్యాశాఖ మంత్రి సతీమణికి కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (21:30 IST)
ఒడిశాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒడిశాలో ఇప్పటివరకు ఏడుగురు రాష్ట్ర మంత్రులు, 22 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు కోవిడ్ భారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఒడిశా స్కూల్ అండ్ మాస్ ఎడ్యూకేషన్ మినిస్టర్ సమీర్ రంజన్ దాస్‌, ఆయన భార్య సంగీతా దాస్‌ కోవిడ్ భారిన పడ్డారు. టెస్ట్ ఫలితాల్లో ఇరువురికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా వచ్చినట్లు మంత్రి స్వయంగా వెల్లడించారు. 
 
గత వారం రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా మంత్రి సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ మోహంతీ సైతం స్పందిస్తూ తను కూడా కరోనా వైరస్ భారిన పడ్డట్లు వైద్యుల సలహా మేరకు భువనేశ్వర్ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే బీజేపీ లోక్‌సభ ఎంపీ సురేశ్ పూజారి, ఎమ్మెల్యే సుకంతా కుమార్ నాయక్ లకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments