Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధారావిలో కరోనా కేసులు నిల్.. జనవరిలో రెండోసారి జీరో కేసులు

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (21:11 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో గత 24గంటల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని అధికారులు బుధవారం తెలిపారు. జీరో కేసులు జనవరిలో రెండోసారి అని, నగరంలో కరోనా వ్యాప్తి చెందిన అనంతరం మూడోసారి అని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 22న ఎలాంటి వైరస్ కేసులు నిర్ధారణ కాలేవు. గతేడాది డిసెంబర్‌ 25న కూడా ఒక్క కేసు సైతం నమోదు కాలేదు. 
 
ప్రస్తుతం ధారావిలో కేస్‌లోడ్‌ 3,911 కు చేరగా.. ఇప్పటి వరకు 3585 మంది కోలుకొని దవాఖానాల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 14 క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఈ మురికివాడలో తొలి కరోనా కేసు గత ఏడాది ఏప్రిల్ 1న నమోదైంది. 
 
ముంబైలో ఫస్ట్‌ కొవిడ్‌ కేసును గుర్తించిన దాదాపు 20 రోజుల తర్వాత ఇక్కడ ఓ వ్యక్తి వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించాడు. 2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారావిలో 6.5లక్షలకుపైగా జనాభా ఉండగా.. ఆసియాలోనే అతిపెద్ద మురికవాడగా నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments