ధారావిలో కరోనా కేసులు నిల్.. జనవరిలో రెండోసారి జీరో కేసులు

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (21:11 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో గత 24గంటల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని అధికారులు బుధవారం తెలిపారు. జీరో కేసులు జనవరిలో రెండోసారి అని, నగరంలో కరోనా వ్యాప్తి చెందిన అనంతరం మూడోసారి అని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 22న ఎలాంటి వైరస్ కేసులు నిర్ధారణ కాలేవు. గతేడాది డిసెంబర్‌ 25న కూడా ఒక్క కేసు సైతం నమోదు కాలేదు. 
 
ప్రస్తుతం ధారావిలో కేస్‌లోడ్‌ 3,911 కు చేరగా.. ఇప్పటి వరకు 3585 మంది కోలుకొని దవాఖానాల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 14 క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఈ మురికివాడలో తొలి కరోనా కేసు గత ఏడాది ఏప్రిల్ 1న నమోదైంది. 
 
ముంబైలో ఫస్ట్‌ కొవిడ్‌ కేసును గుర్తించిన దాదాపు 20 రోజుల తర్వాత ఇక్కడ ఓ వ్యక్తి వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించాడు. 2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారావిలో 6.5లక్షలకుపైగా జనాభా ఉండగా.. ఆసియాలోనే అతిపెద్ద మురికవాడగా నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments