Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో దుమ్ము దులుపుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (18:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు దుమ్ము రేపుతున్నాయి. అంతకంతకూ ఈ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 14,502 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు గడిచిన 24 గంటల్లో మొత్తం 14,502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఈ కేసులతో కలుసుకుంటే మొత్తం  కేసుల సంఖ్య 21,95,136కు చేరిందని తెలిపింది. 
 
అలాగే, గత 24 గంటల్లో ఏడుగురు చనిపోయారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 93,305 పాజిటివ్ కేసులు ఉండగా, 4,800 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కరోనా నుంచి విముక్తి పొందిన వారిలో 20,87,282 మంది ఉన్నారు. 

3 లక్షలకు పైగా కోవిడ్ కేసులు 
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. వరుసగా ఐదో రోజు కూడా మూడు లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం ఈ కేసుల నమోదులో కాస్త తగ్గుముఖం కనిపించింది. ఆదివారం కంటే సోమవారం 27469 పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ మేరకు ప్రస్తుతం దేశంలో 03,06,064  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో కొత్తగా 439 మంది మరణించారు. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,43,328కి చేరింది. ఇందులో 3,68,04,145 మంది కరోనా బారినపడ్డారు. అలాగే, 4,89,849 మంది ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments