Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (17:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. గత రెండు రోజులుగా ఈ కేసుల పెరుగుదలలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. మంగళవారం విడుదల చేసిన ప్రకటన మేరకు 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు పది వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో 4,1713 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. ఇందులో 10,057 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో అత్యధికంగా విశాఖపట్టణం జిల్లాలో 1,827 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, చిత్తూరులో 1,822 కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇకపోతే, ఈ కరోనా వైరస్ సోకి 8 మంది చనిపోగా, మరో 1,222 మంది కోలుకున్నారు. అలాగే, తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,27,441కు చేరగా, వీరిలో 20,67,984 మంది కోలుకున్నారు. అలాగే, 14522 మంది చనిపోయారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments