దేశంలో 703 మంది కరోనా బాధితులు మృతి - కొత్తగా 3.47 లక్షల కేసులు

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (10:01 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరింది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న బాధితుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 703 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, దేశ వ్యాప్తంగా కొత్తగా 3.47 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం వెల్లడైన కేసులతో పోల్చితే ఈ కేసుల సంఖ్య 29,722 అధికం. 
 
ఇదే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,47,254 మందికి ఈ వైరస్ సంక్రమించింది. అలాగే, 2,51,777 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 20,18,825గా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతంగా ఉంది. అదేవిధంగా దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 9692కు చేరుకున్నాయి. నిన్నటితో పోల్చితో ఈ కేసుల సంఖ్య 4.36 శాతం అధికం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anupama Parameswaran: క్రేజీ కల్యాణం నుంచి అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే పోస్టర్

Suhas: నా ముందే ఒకాయన సెట్‌లో ఇతన్నెందుకు పిలిచారు అన్నాడు: సుహాస్‌

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments