దేశంలో 703 మంది కరోనా బాధితులు మృతి - కొత్తగా 3.47 లక్షల కేసులు

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (10:01 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరింది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న బాధితుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 703 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, దేశ వ్యాప్తంగా కొత్తగా 3.47 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం వెల్లడైన కేసులతో పోల్చితే ఈ కేసుల సంఖ్య 29,722 అధికం. 
 
ఇదే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,47,254 మందికి ఈ వైరస్ సంక్రమించింది. అలాగే, 2,51,777 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 20,18,825గా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతంగా ఉంది. అదేవిధంగా దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 9692కు చేరుకున్నాయి. నిన్నటితో పోల్చితో ఈ కేసుల సంఖ్య 4.36 శాతం అధికం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments