Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర కరోనా ఉధృతి : రెండోసారి వైరస్ బారినపడిన మంత్రి

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (09:46 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో రోజుకు దాదాపు 25 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరు రెండోసారి ఈ వైరస్‌ కోరల్లో చిక్కారు. దీంతో ఆయన దవాఖానలో చేరారు. ఈ మధ్యకాలంలో తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. 
 
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో సామాజిక న్యాయం, స్పెషల్‌ అసిస్టెన్స్‌ శాఖ మంత్రిగా ధనుంజయ్‌ ముండే పనిచేస్తున్నారు. ఎన్సీపికి చెందిన ఈయనకు గతేడాది జూన్‌ నెలలో కరోనా వైరస్ సోకింది. మరోసారి తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఆయన ట్విటర్‌ ద్వారా మంగళవారం అర్థరాత్రి ప్రకటించారు.
 
"నాకు ఈరోజు రెండోసారి కరోనా పాజిటివ్‌ వచ్చింది. గత కొన్నిరోజులుగా తనను కలిసిన ప్రతిఒక్కరు పరీక్షలు చేయించుకోవాలి. తనగురించి భయపడాల్సింది ఏమీలేదు. ప్రతిఒక్కరు విధిగా మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలి" అని మరాఠీలో ట్వీట్‌ చేశారు.
 
ఇదిలావుంటే, మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే 28,699 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,33,026కు చేరాయి. ఇందులో 22,47,495 మంది బాధితులు వైరస్‌ బారినుంచి కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments