Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతా కొత్త కరోనా తలనొప్పి-మహారాష్ట్రలో జనవరి 31 వరకు లాక్ డౌన్..

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (14:06 IST)
దేశంలో కరోనా వైరస్ కొత్త రకం వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరో నెలరోజులపాటు పొడిగించింది. జవవరి 31 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉంటాయని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నది. వచ్చేనెల జనవరి 5 వరకు పట్టణ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
 
కాగా, పుణేలో ఇప్పటికే ఒకరికి కరోనా కొత్త వైరస్‌ సోకింది. మొత్తం 50 మంది నమూనాలను పరీక్షించగా ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో యూకే నుంచి వస్తున్న వారిపై అధికారులు నిఘా పెంచారు.
 
దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,25,066 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 49,373మంది మరణించగా, 55,672 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలోని ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 60 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అందులో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments