Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 423మంది మృతి

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (21:18 IST)
మహారాష్ట్రలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో కరోనా మరణాలు 27వేలు దాటాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో 423 మంది వ్యాధి బారిన పడి మరణించగా ఇప్పటివరకు మొత్తం 27,027 మంది మృత్యువాత పడ్డారని మంగళవారం వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 
 
ఇవాళ 16,429 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 9,23,641కి చేరుకుంది. తాజాగా 14,922మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా మొత్తం 6,59,322మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం 2,36,934 యాక్టీవ్ కేసులున్నాయి.
 
అలాగే దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 43 లక్షలకు చేరువవగా, మరణాల రేటు దిగిరావడం సానుకూల పరిణామమని అధికారులు పేర్కొన్నారు. ఆగస్ట్‌ తొలి వారంలో కరోనా మహమ్మారి బారినపడి మరణించేవారి సంఖ్య 2.15 శాతం ఉండగా, ఇప్పుడది ఏకంగా 1.7 శాతానికి దిగివచ్చిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments