Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కోవిడ్ అప్‌డేట్: 24 గంటల్లో 1,555 కేసులు.. ఏడుగురు మృతి

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (11:02 IST)
తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,554 కొత్తగా వ్యాధి సోకిన వారిని గుర్తించారు. 43,916 పరీక్షలు చేయగా ఈ స్థాయిలో కేసులు వచ్చాయి. మరోవైపు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 1,435 మంది బాధితులు కోలుకున్నారు. 
 
దీంతో రికవరీ రేటు 87 శాతానికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,19,224 మందికి వ్యాధి సోకిందని తేలింది. వీరిలో 1,256 ప్రాణాలు కోల్పోగా.. 1,94,653 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇంకా 23,203 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
19 వేలకు పైగా మంది హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 37,46,963 శాంపిళ్లను వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు. నిన్న అత్యధికంగా జీహెచ్‌ఎంసీ 249, రంగారెడ్డి 128, మల్కాజ్‌గిరి 118, మిగితా జిల్లాల్లో వందలోపు కేసులు నమోదవుతున్నాయని హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
గతంలో హైదరాబాద్‌లోనే అధిక సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు పాకేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే హైదరాబాద్‌లో కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. పల్లెటూర్లలో సైతం ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments