Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు వైద్య కాలేజీలో కరోనా కలకలం - 15 మందికి పాజిటివ్

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (11:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న వైద్య కాలేజీలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఈ కాలేజీలోని అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. ఇప్పటివరకు 50 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 15 మందికి ఈ పాజిటివ్ ఫలితం వచ్చింది.
 
ఇందులో 11 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం చదువుతుంటే, నలుగురు హౌస్ సర్జన్ విద్యార్థులు. అలాగే, మరో 40 మంది విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించి పరిశోధనాశాలకు పంపించారు. వైద్య కాలేజీలో చదువుకునే విద్యార్థులకు ఈ వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్‌గా వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
అలాగే, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఈ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్ఐలతో పాటు.. 9 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో వారిని ఐసోలేషన్‌కు తరలించారు. అలాగే, ఈ స్టేషన్‌లోని మిగిలినవారికి కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments