Webdunia - Bharat's app for daily news and videos

Install App

2020ని కరోనా మింగేస్తుందా? కెన్యా కీలక నిర్ణయం.. ఏంటది?

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (22:04 IST)
2020 సంవత్సరాన్ని కరోనా మింగేసేలా వుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. కెన్యా కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యంతో పాటు ఇతర దేశాలు కరోనాను తరిమికొట్టేందుకు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ విధిస్తూ.. కరోనాను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాయి.

ఇందులో భాగంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఫలితంగా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కెన్యా దేశం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్కూళ్లు తెరవకూడదని నిర్ణయించింది. 
 
2021లో మళ్లీ స్కూల్స్ తెరవనున్నట్లు ప్రకటించింది. కెన్యా విద్యా శాఖ కేబినెట్ సెక్రటరీ ప్రొఫెసర్ జార్జ్ మగోహా ప్రకటించారు. కెన్యాలో కరోనా తీవ్రత రానురాను పెరుగుతోందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్కూల్స్ తెరవడం శ్రేయస్కరం కాదని మగోహ తెలిపారు. 
 
విద్యా సంవత్సరం వృధా అవుతుందని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదని..  అయితే.. ఈ విద్యా సంవత్సరంలో ఏ క్లాస్ చదువుతున్నారో.. 2021లో మళ్లీ అదే క్లాస్‌లో చదవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో కెన్యాలో మార్చి 15 నుంచి స్కూల్స్ మూతపడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments