Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా తగ్గినా కేసులు - 3 నెలలు తర్వాత 50 వేలకు దిగువకు...

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (12:59 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా, గత మూడు నెలల తర్వాత కొత్త కరోనా పాజిటివ్ కేసులు 43 వేల కంటే దిగువకు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 42,640  క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్ర‌క‌టించింది.
 
ఈ ప్రకటన మేరకు 24 గంటల్లో 81,839 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,77,861కు చేరింది. మరో 1,167 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,89,302కు పెరిగింది.
 
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,89,26,038 మంది కోలుకున్నారు. 6,62,521 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 28,87,66,201 డోసులు ఇచ్చారు.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 39,40,72,142 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 16,64,360 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments