Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర జైలులో ఖైదీలకు కరోనా.. ఇంద్రాణి ముఖర్జి ఆ జైలులోనే..?

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (12:00 IST)
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌తో కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో మూడు లక్షలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 2,95,041 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 2,023 మంది బాధితులు మృతి చెందారు.
 
అలాగే కరోనాకు మహారాష్ట్ర హాట్ స్పాట్‌గా మారింది. మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. గత రెండు వారాలుగా రోజూ 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బయటి జనాలనేగాక ఇప్పుడు జైల్లో ఖైదీలను కూడా కరోనా గడగడలాడిస్తుంది. 
 
ముంబైలోని బైకులా జైల్లో ఇవాళ 38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. షీనా బోరా హత్యకేసులో దోషిగా తేలిన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జి కూడా ప్రస్తుతం ఆ జైల్లోనే శిక్ష అనుభవిస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చిన 38 మంది ఖైదీల్లో ఇంద్రాణి కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments