గర్భిణీలకు వ్యాక్సిన్ లేదు.. స్వల్పంగా జ్వరం, ఆ ప్రాంతంలో నొప్పి వుంటుంది..

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (10:25 IST)
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది. జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ప్రపంచంలోకెల్లా అత్యంత భారీ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం మన దేశంలో జరగనుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రెండు డోసుల వ్యాక్సిన్‌ ఒకే కంపెనీకి చెందినదై ఉంటుంది. రెండు కంపెనీల వ్యాక్సిన్ ఒక వ్యక్తికి ఉపయోగించరు. కాగా గర్భవతులకు, బాలింతలకు ప్రస్తుతానికి వ్యాక్సిన్ వేయరు. 
 
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలకు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన విధివిధాలను పంపింది. దీనితో పాటు కోవిషీల్డ్‌కు సంబంధించిన ఫ్యాక్ట్‌షీట్ కూడా జతచేసింది. ఈ ఫ్యాక్ట్‌షీట్‌లో వ్యాక్సినేషన్ డోసు, కోల్డ్ స్టోరేజ్ మొదలైన వివరాలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేయాల్సినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానిలో తెలియజేశారు.
 
మరోవైపు కరోనా టీకాలపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ప్రపంచంలో కరోనా టీకా కారణంగా కొద్దిమందిలో సైడ్‌ఎఫెక్ట్‌లు కనిపించిన కారణంగా చాలామంది టీకా వేయించుకోవడంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా రంగంలోకి దిగి, ఇటువంటి అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు.
 
కరోనా టీకా వలన నపుంసకులు అవుతారంటూ వినిపిస్తున్న ఊహాగానాలను హర్షవర్థన్ ఖండించారు. ఇటీవల ఒక రాజకీయ నేత ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి వివరణ ఇచ్చిన హర్షవర్థన్... కరోనా టీకా కారణంగా మహిళలు గానీ, పురుషులు గానీ నపుసంకులు అవుతారని శాస్త్రవేత్తలెవరూ చెప్పలేదని, అటువంటి ఆధారాలు కూడా లేవని అన్నారు. నిరాధానమైన ఇటువంటి ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 
 
అయితే కోవిడ్ టీకా వేయించుకున్న తరువాత కొద్దిమందిలో స్వల్ప జ్వరం, టీకా వేయించుకున్న ప్రాంతంలో నొప్పి ఉంటుందని అన్నారు. ఇతర టీకాలు వేయించుకున్నప్పుడు కూడా ఇదేవిధంగా జరుగుతుందన్నారు. కొద్ది సేపటిలోనే ఇటువంటి సమస్యలు మాయయవుతాయని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments