Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణనీయంగా తగ్గిన కోవిడ్ యాక్టివ్ కేసులు...

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (11:05 IST)
దేశంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పా
జిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 50 వేలకు దిగువకు చేరుకున్నాయి.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3.21 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 5,379 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ముందురోజు కంటే వెయ్యి కేసులు అదనంగా వచ్చాయి. పాజిటివిటీ రేటు 1.67 శాతానికి చేరింది.
 
అలాగే, ఈ వైరస్ నుంచి మంగళవారం 7,094 మంది కోలుకున్నారు. కేరళలో 11 మరణాలు నమోదు కాగా.. దేశవ్యాప్తంగా మొత్తం 27 మంది మృతి చెందారు. క్రియాశీల కేసులు 50 వేలకు తగ్గాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 50,594(0.11 శాతం)కి చేరింది. 
 
ఈ రెండేళ్ల కాలంలో 4.44 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.70 శాతం మంది వైరస్‌ను జయించారు. ఇక ఇప్పటివరకూ 213 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. మంగళవారం 18.8 లక్షల మంది టీకా తీసుకున్నారని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments