మళ్లీ విజృంభిస్తోన్న కరోనా-24 గంటల్లో 166 మందికి కోవిడ్

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (15:13 IST)
2019లో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ దాదాపు 2-3 ఏళ్లపాటు యావత్ ప్రపంచాన్ని వణికించింది. కానీ కొత్త కొత్త వేరియంట్‌లు పుట్టుకొస్తూ అక్కడక్కడ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి దాదాపు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఈ క్రమంలో దేశంలో ఇటీవల రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్య కొత్త భయాందోళనలకు గురిచేస్తోంది. వైద్య శాఖ గణాంకాల ప్రకారం, దేశంలో 24 గంటల్లో కొత్తగా 166 మందికి కోవిడ్ -19 సోకింది. 
 
శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ కొత్త కేసులు ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదవడం మరింత కలవరపెడుతోంది.
 
దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. చాలా రోజుల తర్వాత దేశంలో మళ్లీ కొత్త కోవిడ్ కేసులు బయటికి వచ్చాయి. ఒక్కరోజులో 166 కొత్త కేసులు నమోదు కావడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కొత్త కేసులు ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 
 
ఈ 166 కొత్త కేసులతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రోజువారీ సగటు కరోనా కేసుల సంఖ్య 100 కంటే తక్కువగా ఉండగా.. తాజాగా అది 166కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 
 
అయితే, దేశంలో శీతాకాలం కొనసాగుతున్నందున ఇన్‌ఫ్లుఎంజా వంటి వైరస్‌ల కారణంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం చెబుతోంది. ఇటీవల, సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఒక మహిళ కరోనా ఇన్‌ఫెక్షన్‌తో మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
ఈ ఏడాది జులైలో కరోనా తీవ్రత తగ్గిన తర్వాత దేశంలోనే అత్యల్పంగా కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జూలై 24, 2023న దేశంలో కేవలం 24 కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. 
 
రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండడంతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మన దేశంలో మొదటి కరోనా కేసు 2020 జనవరి 7న కేరళ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. 
 
కేరళలోని త్రిసూర్ జనరల్ హాస్పిటల్‌లో 20 ఏళ్ల మహిళకు వైరస్ లక్షణాలు కనిపించడంతో, ఆమె రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌లో పరీక్షించారు. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి దేశంలో వెలుగులోకి వచ్చిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.44 కోట్లకు చేరుకుంది. 
 
కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 33 వేల 306కి పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments