Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా దూకుడు... 14 రోజుల్లోనే లక్ష పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (21:51 IST)
దేశంలో కరోనా వైరస్ దూకుడు కొనసాగుతోంది. ఫలితంగా కేవలం 14 రోజుల్లో లక్ష కొత్త కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, దేశంలో కరోనా వైరస్ వ్యాపించిన నెలల వ్యవధిలో లక్ష కేసులు దాటితే గత 14 రోజుల్లో లక్ష నుంచి 2 లక్షలకు చేరాయి. ఈ దూకుడు కేంద్ర రాష్ట్రాలతో పాటు.. దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 
 
మరోవైపు, గత 24 గంటల వ్యవధిలో భారత్‌లో 8,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రపంచంలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న టాప్ 10 దేశాల్లో భారత్‌ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ఆరో స్థానంలో 2.33 లక్షల కరోనా పాజిటివ్ కేసులతో ఇటలీ ఉండటం గమనార్హం. 
 
అయితే, భారత్‌లో ఇప్పటిలానే కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగితే ఇటలీని పక్కకు నెట్టేసి ఆరో స్థానానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదనేది వైద్య నిపుణుల అంచనాగా వుంది. గత మూడు రోజులుగా భారత్‌లో 8 వేలకు మించి కరోనా పాజిటివ్ నమోదవుతున్నాయి. 
 
భారత్‌లో కరోనా హాట్ స్పాట్‌గా 70,000 పైచిలుకు కేసులతో మహారాష్ట్ర ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తమిళనాడులో 24 వేల కేసులు ఉన్నాయి. ఒక్క చెన్నై నగరంలోనే దాదాపుగా 17 వేల కేసులు నమోదైవున్నాయి. ఢిల్లీలో కూడా కరోనా దూకుడు ఇలానేవుంది. దీంతో సరిహద్దులను కూడా మూసివేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments