Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరో 11502 కరోనా కేసులు... మరణాల్లో 9వ స్థానం

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (11:33 IST)
దేశంలో కొవిడ్‌-19‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సోమవారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 11,502 మందికి కొత్తగా కరోనా సోకింది. అదేసమయంలో 325 మంది మరణించారు.
 
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,32,424 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 9,520కి పెరిగింది. 1,53,106 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,69,798 మంది కోలుకున్నారు. 
 
మరోవైపు, దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో కరోనా మరణాల్లో 9వ స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,32,424 కేసులు నమోదు కాగా... 9520 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. 
 
అలాగే దేశవ్యాప్తంగా 1,53,106 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 1,69,798 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. 
 
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 11,502 కేసులు నమోదు కాగా... 325 మంది మృతి చెందారు. దేశంలో కరోనా రికవరీ రేటు 51 శాతానికి చేరింది. మరోవైపు మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 
 
మహారాష్ట్రలో అత్యధికంగా 1,07,958 కేసులు నమోదు కాగా...3950 మంది మృతి చెందారు. అలాగే తమిళనాడులో 44,661 కేసులు నమోదు అవగా 435 మంది మృతి చెందారు. 
 
ఢిల్లీలో 41,182 కేసులు నమోదు కాగా...1327 మంది మృతి చెందారు. అలాగే గుజరాత్‌లో 23,544 కేసులు నమోదు అవగా 1477 మంది మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments