Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషి నుంచి కుక్కకు.. కరోనా వైరస్ వ్యాప్తి.. హాంకాంగ్‍లో తొలి కేసు

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (16:34 IST)
ఇప్పటివరకు కరోనా వైరస్ మనుషులకు మాత్రమే సోకుతూ భయభ్రాంతులకు గురిచేస్తూ వచ్చింది. అయితే, ఈ వైరస్ మనుషులు ద్వారా పెంపుడు జంతువులకు కూడా సోకుందని తేలింది. తాజాగా ఓ ఇంట్లోని పెంపుడు శునకానికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ శునకాన్ని క్వారంటైన్‌కు తరలించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, హాంకాంగ్‌కు చెందిన 60 యేళ్ళ మహిళ ఓ శునకాన్ని పెంచుకుంటూ ఉంది. ఆమె కరోనా వైరస్ బారినపడి కోలుకుంది. అయితే, ఆమె పెంపుడు శునకం కూడా ఈ వైరస్ బారినపడింది. దీన్ని గుర్తించిన స్థానిక అధికారులు ఆ శునకాన్ని జంతువుల క్వారంటైన్‌కు పంపించారు. గత శుక్రవారం నుంచి దానికి క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో దానికి బలహీన స్థాయిలో కరోనా వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ దెబ్బకు హాంకాంగ్ ప్రభుత్వం పెంపుడు జంతువులకు కూడా ప్రత్యేక క్వారంటైన్ (ఐసోలేష్ వార్డుల తరహాలోనే)ను ఏర్పాటు చేసింది. ఇక్కడ కరోనా వైరస్ పడిన జంతువులకు 14 రోజుల పాటు అక్కడ ఉంచి చికిత్స అందిస్తారు. మనుషుల ద్వారా శునకానికి కరోనా వైరస్ సోకడం ప్రపంచలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments