Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం మూసివేత-22 మంది ఉద్యోగులకు కరోనా

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (11:00 IST)
కేరళలో ఒకేరోజు 4,698 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 59,438కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,07,119 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో కేరళలోని సుప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని రెండు వారాలపాటు మూసివేయనున్నారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో పనిచేస్తున్న 22మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 
 
దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆలయాన్ని మూసివేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు వారాలపాటు భక్తులను దర్శనాలకు అనుమతించడం లేదని ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక.. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ భక్తులకు ఆలయంలో ప్రవేశాలు కల్పించారు.
 
శబరిమల తీర్థయాత్రలు ప్రారంభమైన నేపథ్యంలో గురువాయూర్ దేవాలయంలో ఆన్‌లైన్ బుకింగ్ కూడా ప్రారంభించారు. భక్తులకు ప్రవేశం లేకుండా గురువాయూర్ ఆలయాన్ని మూసివేసినప్పటికీ పూజారులు మాత్రం ఆలయంలో క్రమం తప్పకుండా ఏకాంతంగా పూజాదికాలు కొనసాగిస్తారని ఆలయ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments