Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ ఉగ్ర పంజా... దేశంలో 24 గంటల్లో 32,695 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:48 IST)
భారత్‌లో కరోనా తన ఉగ్ర పంజాను విసురుతున్నది. కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 32,695 కేసులు నమోదు కాగా 606 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల మేరకు దేశంలో మొత్తం 9,68,876 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,31,146 ఉండగా 6,12,814 మంది చికిత్స నిమిత్తం కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉండగా 24,915 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,26,826 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు దేశంలో 1,27,39,490 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments