వేడి నీళ్ళతో స్నానం చేస్తే కరోనా వైరస్ చనిపోతుందా? (video)

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (16:17 IST)
భారత్‌తో పాటు.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా వైరస్. ఈ వైరస్ ధాటికి అనేక మంది పిట్టల్లా రాలిపోతున్నారు. లక్షలాది మంది ఈ వైరస్ బారిపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరు ఈ వైరస్ బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఈ వైరస్ బారినపడినవారు త్వరగా కోలుకునేందుకు తమకు తోచిన పద్ధతులను అవలంభిస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి రక్షణ పొందే సలహాలు, సూచనలే తీసుకోవాలి. అపోహలు, అయోమయానికి గురిచేసే వార్తలకు దూరంగా ఉండాలి. 
 
ముఖ్యంగా, చాలా మందికి ఎండలో నిలబడినా, లేక వేడినీళ్ళతో స్నానం చేసినా ఈ వైరస్ చనిపోతుందన్న అపోహతో పాటు.. బాహ్యప్రపంచంలో ప్రచారం ఎక్కువగానే జరుగుతుంది. దీనిపై వైద్యులను సంప్రదిస్తే, నీళ్ళు బాగా తాగడం వల్ల కరోనా వైరస్‌ ఒంట్లో నుంచి పోతుందని అనుకోవడం అపోహే. అలాగే, ఐస్‌ క్రీములు తిన్నంత మాత్రాన వైరస్‌ స్తంభించిపోతుందని అనుకోవడమూ తప్పే!
 
అలాగే, వేడి నీళ్లతో స్నానం చేసినా, అలాగే హ్యాండ్‌ డ్రయ్యర్లు వాడినా వైరస్‌ చనిపోతుందని అనుకోవడం పొరపాటు. అలాగే, ఎండలో నిలబడినంత మాత్రాన వైరస్‌ పోదు. ఒంటి మీద ఆల్కహాల్‌ స్ర్పే చేసుకున్నా, లేదంటే ఆల్కహాల్‌ తాగినా వైరస్‌ చనిపోతుందనుకోవడం అపోహ. ఫ్లూ టీకాలు వేసుకుంటే కొవిడ్‌ 19 వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుందనే ప్రచారం అర్థరహితమే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. అల్లు వారింటికి విరోష్ దంపతులు...

ఒక రాత్రికి రేటెంత అని అనడుగుతారా? మీరు రాక్షసులే: రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం

Radha: మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్ షోకి జ్యూరీగా అనిల్ రావిపూడి, రాధ, లయ, హోస్ట్ గా శ్రీముఖి

VISA - వింటారా సరదాగా చిత్రం నుండి అనగా అనగా అమెరికా విడుదల

లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ నూతన కథాంశంతో చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments