కోవిడ్ రోగుల్లో నిస్సత్తువ పోవాలంటే...

Webdunia
మంగళవారం, 18 మే 2021 (11:48 IST)
దేశంలో కోట్లాది మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో లక్షలాది మంది ఇప్పటికీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. ప్రతి రోజూ వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న, లేదా చికిత్స ముగించుకుని ఇంటికి చేరుకున్న కరోనా రోగులు ప్రత్యేకంగా ఆహార నియమం పాటించాలని కోరుతున్నారు. ఈ భోజన నియమాలతో నిస్సత్తువ, నీరసం వదిలి, కోలుకునే వేగం పెరుగుతుంది.
 
ఆ ఆహార ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. నిద్ర లేచి వెంటనే, నీళ్లలో నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష తినాలి. బాదంలో మాంసకృత్తులు, ఎండుద్రాక్షలో ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొవిడ్‌ తాలూకు నీరసాన్ని వదిలిస్తాయి.
 
ఉదయాన్నే అల్పాహారంగా రాగి దోశ లేదా పోరిడ్జ్‌ ఉత్తమమైన అల్పాహారం. మధ్యాహ్న భోజనంతో లేదా భోజనం తర్వాత తీసుకునే పదార్థాలతో పాటు నెయ్యి, బెల్లం తినాలి. వీటిని రోటీతో కలిపి కూడా తినవచ్చు.
 
రాత్రి భోజనంలో కిచిడి తింటే అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. తేలికగా అరగడంతో పాటు మంచి నిద్ర పడుతుంది. ఎక్కువగా నీళ్లు తాగాలి. నీళ్లతో పాటు నిమ్మరసం, మజ్జిగా తాగాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments