తూగో కరోనా దూకుడు ... ఒక్క జిల్లాలోనే 219 ... ఓ గ్రామంలో 113 కేసులు

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (14:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు ఏకంగా 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, జిల్లాలోని పెదపూడి మండలంలోని గొల్లాల మామిడాడ అనే గ్రామంలో 113 మంది కరోనా పాజిటివ్ రోగులు ఉన్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజానికి తూర్పు గోదావరి జిల్లాలో సరిగ్గా పది రోజుల క్రితం మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కేవలం 62 మాత్రమే. ఆ తర్వాత ఇంటింటి సర్వే చేపట్టడంతో ఈ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. 
 
ముఖ్యంగా, జి. మామిడాడ గ్రామంలో 5 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇందులో 120 మందికి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఈ గ్రామంలో 113 కేసులు ఉన్నట్టు తెలిపారు. దీంతో గ్రామంలో హైఅలెర్ట్ ప్రకటించారు. పైగా, లాక్డౌన్ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. 
 
ఇదే అంశంపై అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఇంటింటి సర్వే చేపట్టడంతో ఈ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 219 పాజిటివ్ కేసులు ఉన్నట్టు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments