Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకుంటే ఫలితం ఎలా వుంటుందో తెలుసా?

Webdunia
బుధవారం, 12 మే 2021 (13:37 IST)
న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ డోసు ఒక్కటి తీసుకుంటే.. కరోనా బాధితులను 80 శాతం వరకు మరణం నుంచి కాపాడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్(పీహెచ్ఈ) తెలిపింది. ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న తర్వాత 80 శాతం వరకు, రెండో డోసు వేసుకున్న తర్వాత 97 శాతం వరకు మరణం నుంచి కాపాడుతుందని వెల్లడించింది.
 
వాస్తవిక పరిస్థితులను బట్టి ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మరణాలను తగ్గిస్తుందని పీహెచ్ఈ పేర్కొంది. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు 28 రోజుల్లో కరోనాతో చనిపోయినవారి డేటాను పరిశీలించగా.. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వేసుకున్నవారు ప్రాణాలు నిలుపుకున్నారని తెలిపింది.
 
వ్యాక్సిన్ వేసుకోని వారికంటే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నవారు 55 శాతం మంది, ఫైజర్ డోసు వేసుకున్నవారు 44 శాతం మంది మరణం నుంచి తప్పించుకుంటున్నారని వెల్లడించింది. కరోనా బాధితులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక డోసు వేసుకోవడం ద్వారా 80 శాతం మరణం నుంచి రక్షణ పొందుతున్నారని పీహెచ్ఈ తన అధ్యయనంలో వెల్లడించింది.
 
ఇక ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ కరోనా వచ్చే రెండు వారాల ముందు వేసుకున్నా.. మరణం నుంచి 69 శాతం రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే 97 శాతం రక్షణ కల్పిస్తుందని పీహెచ్ఈ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments