Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంపై మరో కొత్త వైరస్ డిసీజ్‌ ఎక్స్‌ అటాక్.. కరోనా కంటే డేంజరస్.. ?

Webdunia
శనివారం, 2 జులై 2022 (14:25 IST)
Corona
ప్రపంచంపై మరో కొత్త మహమ్మారి దాడి చేయనుందని తెలుస్తోంది. అది కరోనా కంటే భయంకరమైంది. దీనిపేరు డిసీజ్‌ ఎక్స్‌ అనిహెచ్చరిస్తున్నారు బ్రిటన్‌ వైద్య నిపుణులు.
 
మూడేళ్ల క్రితం ప్రపంచంపై దాడి చేసిన కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టకముందే మరో కొత్త వ్యాధి పొంచి ఉందని హెచ్చరికలు మొదలయ్యాయి. 
 
కరోనాలో రకరకాల వేరియంట్లకు తోడు కొంత కాలంగా మంకీపాక్స్‌ పలు దేశాలను వణికిస్తోంది. ఇదే సీరిస్‌లో మరో మహమ్మారి ఎటాక్‌ చేసే అవకాశం ఉందంటున్నారు బ్రిటన్‌ వైద్య నిపుణులు. దీనికి 'డిసీజ్‌ 'ఎక్స్‌' అనే పేరుకూడా పెట్టేశారు. కరోనాకన్నా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
 
'డిసీజ్‌ 'ఎక్స్‌' అనేది ప్రస్తుతానికి ఊహాజనితమైన అంటువ్యాధే అయినా, ఇది ప్రపంచం మీద సృష్టిచే విధ్వంసం ఊహించనంత తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరోజులో మిలియన్ల మందిని పొట్టనబెట్టుకుంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
కరోనాకన్నా తీవ్రమైన కొత్త వ్యాధులు వస్తాయని చెబుతున్నారు ప్రాఫెసర్‌ జీన్‌జాక్యూస్‌ ముయేంబే టామ్‌ఫమ్‌.. 1976లో ఎబోలా ను కనుక్కోవడంలో ఈయన కీలకపాత్ర పోషించారు.  

సంబంధిత వార్తలు

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments