ఢిల్లీలో కరోనాతో 25మంది పోలీసుల మృతి, ఇ -పాస్ తప్పనిసరి

Webdunia
బుధవారం, 5 మే 2021 (18:40 IST)
కరోనా వైరస్ ఢిల్లీలో విలయతాండవం చేస్తోంది. రోజువారీగా భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 55 రోజుల్లో 25 మంది ఢిల్లీ పోలీసులు కోవిడ్-19తో మరణించారు. 
 
2021 మార్చి 11 నుంచి ఇప్పటి వరకు 4,200 మందికి పైగా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని టైమ్స్ నౌ నివేదించింది. పీసీఆర్ యూనిట్ నుంచి 441 కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. 
 
మార్చి 10 వరకు ఒక సంవత్సరంలో కనీసం 7,724 మంది ఢిల్లీ పోలీసులకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. మొత్తం 34 మంది పోలీసులు మరణించారు.
 
కరోనా సెకెండ్ వేవ్‌లో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్‌లోని నొయిడా సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ఈనెల 10వ తేదీ వరకూ పొడిగించారు. ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ నవ్‌నీత్ సెహగల్ బుధవారంనాడు ఈ మేరకు ప్రకటించారు. 
 
తాజా లాక్‌డౌన్‌తో మే 10వ తేదీ ఉదయం 7 గంటల వరకూ కరోనా కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. ఈ కాలంలో అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసే ఉంటాయని చెప్పారు.
 
దీనికి ముందు గురువారం ఉదయం 7 గంటల వరకూ లాక్‌డౌన్‌ను యూపీ ప్రభుత్వం పొడిగించింది. లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సర్వీసుల కింద బయటకు వెళ్లాల్సి వస్తే ఇ-పాస్‌లు తప్పనిసరిగా పొందాలని పేర్కొంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునేలా రాకాస ఉంటుంది : నిహారిక కొణిదెల

Amba’s Revenge: తెలుగులో తొలి ఏఐ సినిమా అంబ’s రివెంజ్

శ్రీనివాస మంగాపురం నుంచి స్వాతంత్ర బాబు గా డా. నరేష్ వికే

Ravi Basrur: కటాలన్ కు సలార్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్

Satya: సత్య, రియా సింఘా పై సత్య ఈజ్ నాట్ జెట్లీ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments