ఆంధ్రాలో 12 వేల కరోనా కేసులు - 12 మంది మృతి

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (19:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,561 మందికి ఈ వైరస్ సోకింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40,635 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా ఈ కేసులు బయటపడ్డాయి. ఈ వైరస్ సోకి 12 మంది చనిపోయారు. 
 
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,710 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరులో 1,625, కడపలో 1,215, విశాఖపట్టణంలో 1,211 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అదేవిధంగా మృతుల్లో విశాఖలో మూడు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరేసి, అనంతపురం, చిత్తూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఒక్కరేసి చొప్పున కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ 12 మంది మృతులతో కలుపుకుంటే ఏపీలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 14,591కు చేరింది. అలాగే, ఇప్పటివరకు మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల  సంఖ్య 22,48,608కి చేరగా 21,20,717 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 1,13,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments