Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఆరు నెలల తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (13:22 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. గత ఆరు నెలల తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 3824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
దాదాపు 184 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు, కేరళ రాష్ట్రంలో రెండు మృతి కేసులు నమోదయ్యాయి. ఈ మరణాలతో కలిపి ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారి  సంఖ్య 5,30,389కి చేరింది. అలాగే, దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 18,389కి చేరింది. 
 
రోజువారీ పాజిటివిటీ రేటు 2.87 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.24 శాతంగా ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,47,22,605 మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో 4,41,73,335 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments