భారీగా పెరిగిపోతున్న కరోనా కేసులు... ఐటీ నగరంపై వైరస్ పంజా

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (15:52 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4334కు చేరుకుంది. గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఒక్క బెంగుళూరు నగరంలోనే ఏకంగా 172 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
కర్ణాటకలో ప్రస్తుతం 1,240 యాక్టివ్ కేసులు ఉండటంతో రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దేశంలో జేఎన్-1 సబ్ వేరియంట్ కేసులు 500 దాటాయి. ప్రస్తుతం దేశంలో 541 జేఎన్-1 కేసులు ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

కర్ణాటకలో అత్యధికంగా 199, ఆ తర్వాత కేరళలో 148 కేసులు ఉన్నాయి. తెలంగాణలో 2 కేసులు ఉన్నాయి. మిజోరం, చండీగఢ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, మేఘాలయాలలో కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments