Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల్లో 12మంది మృతి

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (10:01 IST)
తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజు కూడా కరోనా కేసుల తీవ్రత పెరుగుతుంది. తెలంగాణలో కొత్తగా 2207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి చెందారు. ప్రస్తుతం 75,257కి పాజిటివ్ కేసులు పెరిగాయి. మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్‌లో కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో 80 నుంచి 90 శాతం పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణాలో ఇప్పటి వరకు 601 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
యాక్టివ్ కేసులు 21 వేల 417గా ఉండగా కోలుకున్న వారి సంఖ్య 53వేల239కి చేరుకుంది. తెలంగాణాలో రికవరీ రేటు 70.7 శాతంగా ఉంది. రికవరీ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. గురువారం ఒక్క రోజే 23 వేల మందికి కరోనా పరీక్షలు చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments