Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు ఓ పారాసిట్మల్ టాబ్లెట్ చాలు.. పానిక్ బటన్ నొక్కాల్సిన పనిలేదు.. జగన్

Webdunia
ఆదివారం, 15 మార్చి 2020 (16:42 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వైద్య నిపుణులో మందు కనుగొనలేకపోయారు. కానీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓ మందు కనిపెట్టారు. కరోనా వైరస్‌కు ఓ పారాసిట్మల్ మాత్ర సరిపోతుందని సెలవిచ్చారు. అంతేకానీ, కరోనా వైరస్ వల్ల మనుషులు చనిపోతారనీ, ఇదొక భయానక పరిస్థితి అని పానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఆయన ఆదివారం రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. వృద్ధులు, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు, ఇతర వ్యాధులు ఉన్న వారిపై కరోనా వైరస్ ప్రభావం చూపుతుందన్నారు. ఇతరత్ర ఆరోగ్య సమస్యలు లేనివారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 
 
ముఖ్యంగా, కరోనా వైరస్ పై కొన్ని విషయాలు అవగాహన చేసుకోవాలని, ఈ వైరస్ వల్ల మనుషులు చనిపోతారని, ఇదొక భయానక పరిస్థితి అని 'పానిక్ బటన్' నొక్కాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. 'కరోనా' కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం కూడా పాటించాలని సూచించారు. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 70 నమూనాలు పరిశీలిస్తే అందులో ఒకరికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా వచ్చిందని గుర్తుచేశారు. కరోనా కేసుల్లో 13.8 శాతం మాత్రమే ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నాయని, 85 శాతం కేసులకు ఇంటి దగ్గరే చికిత్స జరుగుతోందని, 4.75 శాతం కేసులు మాత్రమే విషమంగా ఉన్నాయని తెలిపారు. 
 
ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను త్వరలోనే ఆయా దేశాలు వారిని స్వదేశానికి పంపిస్తాయని, ఈ పక్రియ కొన్ని నెలలపాటు కొనసాగుతుందని, ఇది రెండు, మూడు వారాల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదని అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు దాదాపు యేడాదిపాటు కొనసాగుతాయని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments