ఏపీలో కొత్తగా 4,038 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (21:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 4,038 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 73,767 శాంపిళ్లను పరీక్షించగా 4,038 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 5,622 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
చిత్తూరు జిల్లాలో 9, ప్రకాశం 7, కృష్ణా 5, ర్పుగోదావరి4, గుంటూరు3, కడప3, విశాఖపట్నం3, అనంతపురం, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలలో ఒకరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,71,503కి చేరింది.
 
ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 6,357కి చేరింది. వివిధ ఆస్పత్రులలో చికిత్స పొంది కోలుకొని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,22,204గా వుంది. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆస్పత్రులలో 40,047 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 68,46,040 మంది నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Eesha Rebha: ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Peddi: రామ్ చరణ్ చిత్రం పెద్ది విడుదల వాయిదా వేశారు

Rajasekhar: బుల్లెట్ సునీల్ గా రాజశేఖర్ పవర్ ఫుల్ రీ-స్టార్ట్ గ్లింప్స్ రిలీజ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటన

J. D. Chakravarthy: ప్రచారం కోసం బూతులు మాట్లాడడాన్ని బరాబర్ ఖండిస్తున్నా : జె. డి. చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

తర్వాతి కథనం
Show comments