Webdunia - Bharat's app for daily news and videos

Install App

872 మంది రైల్వే ఉద్యోగులకు కరోనా-86మంది మృతి

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (12:29 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. పలు జోన్లలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులు కరోనా బారినపడుతున్నారు. సెంట్రల్‌ రైల్వే, వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన సుమారు 872 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకూ కరోనా వల్ల 86 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 
 
బాధితులందరిని వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన జగ్జీవన్‌ రామ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. కోవిడ్‌-19 రోగుల చికిత్స కోసం ఏప్రిల్‌లో హాస్పిటల్‌ను ప్రత్యేకంగా కేటాయించారు. అత్యధికంగా సెంట్రల్‌ రైల్వేలో 559 మంది, వెస్ట్రన్‌ రైల్వే నుంచి 313 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మృతిచెందిన వారిలో 86 మందిలో 22 మంది రైల్వే ఉద్యోగులు కాగా, మిగిలిన వారిలో వారి కుటుంబసభ్యులు, రిటైర్డ్‌ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments