Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో తొలి కరోనా మరణం... దేశంలో 20కి పెరిగిన మృతులు

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (13:12 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ఈ వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడినవారిలో 60 యేళ్లకు పైబడిన వారు తిరిగి కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కేరళలో తొలి కరోనా మరణం సంభవించింది. కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన 69 యేళ్ళ రోగి శనివారం కన్నుమూశారు. కరోనా వైరస్‌ కారణంగానే వృద్ధుడు మృతి చెందినట్లు ఎర్నాకులం జిల్లా మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎన్‌కే.కుట్టప్పన్‌ మీడియాకు వెల్లడించారు. కేరళలో వృద్ధుడి మరణంతో భారతదేశంతో కరోనా మృతుల సంఖ్య 20కి చేరింది. 
 
మరోవైపు, దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 873కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 149 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 176 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 12 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 
మహారాష్ట్రలో 162, కర్ణాటకలో 64, తెలంగాణలో 59, గుజరాత్‌లో 54, రాజస్థాన్‌లో 50, యూపీలో 50, ఢిల్లీలో 40, తమిళనాడులో 40, పంజాబ్‌లో 38, హర్యానాలో 33, మధ్యప్రదేశ్‌లో 33, జమ్మూకాశ్మీర్‌లో 20, బెంగాల్‌లో 15, ఏపీలో 13, లడఖ్‌లో 13, బీహార్‌లో 9, ఛండీఘర్‌లో 8, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 6, ఛత్తీస్‌గఢ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, గోవాలో 3, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, ఒడిశాలో 3, మణిపూర్‌, మిజోరాం, పుదుచ్చేరిలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.
 
ఇంకోవైపు, కరోనా వైరస్‌ వ్యాధికి మందు లేదా టీకా కనుగొనేందుకు కనీసం 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని, ఇందుకోసం సామాజిక దూరంతో పాటు.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఈ సంస్థ పిలుపునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments