ఆంధ్రప్రదేశ్‌లో తగ్గని కరోనా వేగం : కొత్తగా మరో 35 కేసులు

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (13:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు మరో కొత్తగా మరో 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త 35 కేసుల్లో ఒక్క కర్నూలు జిల్లాలో 10 కేసులు నమోదు కాగా, గుంటూరులో 9, కడప 6, వెస్ట్ గోదావరిలో 4, కృష్ణా 3, ఆనంతపురం 3 చొప్పున మొత్తం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. కాగా, గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. అయితే.. కరోనాతో ఇప్పటివరకూ మొత్తం 22 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలావుంటే, 639 మందికి చికిత్స  కొనసాగుతుండగా 96 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 
 
జిల్లాల వారీగా కేసులు లెక్కలు చూస్తే... అనంతపూరంలో 36, చిత్తూరులో 53, ఈస్ట్ గోదావరిలో 26, గుంటూరులో 158, కడపలో 46, కృష్ణలో 83, కర్నూలులో 184, నెల్లూరులో 67, ప్రకాశంలో 44, విశాఖపట్టణంలో 21, వెస్ట్ గోదావరిలో 39 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments