Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ: శ్మశాసనవాటికలో నో ప్లేస్.. పార్కింగ్ స్థలంలో అంత్యక్రియలు.. ఒక్కరోజే..?

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (09:52 IST)
ఢిల్లీలో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. వందలాదిమంది ప్రాణాలను బలిగొంటోంది. శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 348 మంది మృతి చెందారు. వారం రోజుల క్రితం 104గా ఉన్న మరణాల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం నుంచి 200కు తగ్గకుండా మరణాలు నమోదవుతున్నాయి. ఆ రోజు 240 మంది, మంగళవారం 277 మంది, బుధవారం 249 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 
 
గత పదిరోజుల్లో ఏకంగా 1,750 మంది మృతి చెందడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఢిల్లీలో కరోనా వైరస్ చెలరేగిపోవడానికి యూకే స్ట్రెయినే ప్రధాన కారణమని తాజాగా వెల్లడైంది. మరోవైపు, కరోనా మృతుల అంత్యక్రియలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్మశానాల్లో ఖాళీ లేకపోవడంతో మృతదేహాన్ని రెండు రోజులపాటు ఇంట్లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఢిల్లీలోని సీమాపురి శ్మశాసనవాటికలో అంత్యక్రియలకు చోటులేక పార్కింగ్ స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సామూహిక దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మొన్న ఒక్కరోజే ఇక్కడ 75 మందికి అంత్యక్రియలు జరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments